విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ।। 59 ।।
విషయాః — ఇంద్రియ విషయములు; వినివర్తంతే — నిగ్రహించు; నిరాహారస్య — స్వీయ సంయమం పాటించి; దేహినః — జీవాత్మకి; రస-వర్జం — రుచి తరిగిపోవుట; రసః — రుచి; అపి — కూడా; అస్య — అతనికి; పరం — పరమాత్మ; దృష్ట్వా — తెలుసుకున్న పిదప ; నివర్తతే — తరిగి పోవును.
BG 2.59: సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా కానీ, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును.
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ।। 59 ।।
సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా కానీ, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ …
Sign in to save your favorite verses.
Sign In
Navigate directly to the wisdom you seek
Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
ఉపవాస సమయంలో, ఆహారం తీసుకోవటం ఆపినప్పుడు ఇంద్రియ వాంఛలు బలహీనమవుతాయి. అదే విధంగా, అనారోగ్యంతో ఉన్నప్పుడు, భోగ విషయ/వస్తువులపై ఆసక్తి పోతుంది. ఈ వైరాగ్య స్థితులు తాత్కాలికమైనవి ఎందుకంటే కోరికల బీజం మనస్సులోనే ఉంటుంది. ఉపవాసం ముగిసినప్పుడు లేదా అనారోగ్యం పోయినప్పుడు, ఆయా కోరికలు తిరిగి వస్తాయి.
ఈ కోరికల మూల బీజం ఏమిటి? జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అణు-అంశము, అందుకే భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించటం, ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం. ఆ దివ్య ఆనందం లభించేవరకూ జీవాత్మ తృప్తి చెందదు మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. సాధకులు బలవంతంగా తమ సంకల్పశక్తిచే ఇంద్రియములను నియంత్రించవచ్చు, కానీ ఆ నియంత్రణ తాత్కాలికమే ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలను ఆర్పదు. కానీ, జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై, దివ్య ఆనందాన్ని పొందినప్పుడు, తాను అనంతమైన జన్మలనుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:
రసోవై సః రసమ్ హ్యేవాయం లబ్ధ్వా ఽనందీ భవతి (2.7.2)
‘భగవంతుడు పూర్ణ-ఆనందమయుడు. జీవాత్మ ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు, ఆ ఆనందంలో తనివి తీరుతుంది.’ ఆ తర్వాత సహజంగానే నిమ్న స్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది. భగవత్ భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది.
ఈ విధంగా భగవద్గీత, కేవలం కోరికలను అణచివేయమని చెప్పలేదు, నిజానికి ఆ కోరికలను భగవంతుని వైపు మరల్చి పునీతం చేసే అందమైన మార్గాన్ని ఉపదేశించింది. రామకృష్ణ పరమహంస మాహాత్ముడు ఈ సూత్రాన్ని చాలా చక్కగా చెప్పాడు , ‘భక్తి అంటే సర్వోత్కృష్టమైన దానిపై ప్రేమ; మరియు నిమ్నస్థాయివి వాటంతట అవే వీగిపోతాయి’ (‘Devotion is love for the highest; and the lowest shall fall away by itself.’)